వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు తాలిబన్‌ సేనాపతుల హతం

By Staff
|
Google Oneindia TeluguNews

కాబూల్‌ః అమెరికా జరుపుతున్న ప్రతీకార దాడుల్లో తాలిబన్‌ వైమానిక దళం ప్రధానాధిపతి అక్తర్‌ మహమ్మూద్‌ మన్సూర్‌ హతమైనట్టుగా అనధికార వర్గాలు ప్రకటించాయి. మన్సూర్‌తో పాటు మరో ముఖ్యసైనికాధికారిని కూడా తాలిబన్లు కొల్పోయారు.

జనరల్‌ ఉమర్‌ అతాయ్‌ కూడా సోమవారం రాత్రి అమెరికా వైమానిక దళం జరిపిన దాడుల్లో మరణించినట్టుగా ఇరాన్‌ అధికార వార్తా సంస్థ ఇర్నాపేర్కొంది. ఆదివారం రాత్రి, సోమవారం రాత్రి వరసగా తాలిబన్లసైనిక స్థావరాలు, లాడెన్‌కు చెందిన అల్‌ ఖైదా నెట్‌వర్క్‌ కేంద్రాలపై అమెరికా,బ్రిటన్‌ యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిస్తున్నవిషయం విదితమే. 24 గంటల యుద్ధంలోనే ఇద్దరుసైనిక ప్రముఖలను పోగొట్టుకున్న తాలిబన్ల అమెరికా తాకిడిని ఎక్కువకాలం తట్టుకోవడం అసాధ్యం. అయితే లాడెన్‌, తాలిబన్ల అగ్రనేత ముల్లా ఒమర్‌ మాత్రం ఇప్పటికే సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లిపోయినట్టుగా తెలుస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X