వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీ ట్రాన్స్‌లేటర్‌ నారాయణరావుఅరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:అసెంబ్లీలో ట్రాన్స్‌లేటర్‌గా పని చేస్తున్న నారాయణరావుపై, మరో ఇద్దరిపై పిడి యాక్టు కింద కేసు నమోదు చేశారు. ఈ ముగ్గురిని చంచల్‌గుడా జైలుకు తరలించారు. శాసనసభ్యులకు కేటాయించిన స్థలంలో నారాయణరావు పాల్పడిన అక్రమాలను ఎసిబి అధికారులు ఇటీవల వెలుగులోకి తెచ్చారు. అదే విధంగా ఫలక్‌నుమా ప్రాంతంలోని జంగంమెట్‌కు చెందిన జంగం బలవంత రెడ్డి వంద ఎకరాలకుపైగా ఆక్రమించాడు. గాంధీనగర్‌ రౌడీషీటర్‌ మహ్మద్‌ జహంగీర్‌ దౌర్జన్యంతో ఆక్రమణలకు పాల్పడుతున్నాడు. ఈ ముగ్గురిని పోలీసులు గురువారంఅరెస్టు చేసి జైలుకు తరలించారు.

హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌పేర్వారం రాములు కథనం ప్రకారం- అసెంబ్లీలోట్రాన్స్‌లేటర్‌గా పనిచేస్తున్న నారాయణరావు తన పలుకుబడిని, పరపతిని ఆసరా చేసుకుని బంజారాహిల్స్‌లోని శ్రీ వెంకటేశ్వర కో ఆపరేటివ్‌సొసైటీ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు. కోటిన్నర రూపాయలవిలువ చేసే భూమిని కబ్జా చేశాడు. ఆ స్థలాన్ని వేరే వారికి అమ్మేసి అక్కడ నిర్మాణాలు చేయడానికి ప్రయత్నిస్తుండగాఅరెస్టు చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X