వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మంత్రివర్గవిస్తరణ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః ప్రధాని వాజ్‌పేయి ఒకటి రెండు రోజుల్లో కేంద్ర మంత్రిమండలిని పునర్‌వ్యవస్థీకరించనున్నారు. ఒకరిద్దరు కొత్తవారికి మంత్రిమండలిలో చోటు కల్పించే అవకాశం వున్నదని తెలిసింది. సోమవారం నాడు మంత్రిమండిలిలో మార్పు చేర్పులు చేయనున్నట్టుగా ప్రధాని వాజ్‌పేయి శుక్రవారం నాడు ఢిల్లీలో చెప్పారు. ప్రణాళిక సంఘం డిప్యూటి చైర్మన్‌ కెసి పంత్‌కు కేబినెట్‌లో చోటు కల్పించే అవకాశం వున్నది.

ప్రస్తుతం జస్వంత్‌ సింగ్‌ రక్షణ, విదేశాంగ శాఖలను నిర్వహిస్తున్న దృష్ట్యా ఈ రెండు శాఖల్లో రక్షణను పంత్‌కు అప్పగించే అవకాశం వుందని అంటున్నారు. గతంలో రాజీవ్‌ హయాంలో పంత్‌ రక్షణ మంత్రి బాధ్యతలు నిర్వహించారు. ఈ మధ్య కాలంలో జరిగిన ముంబాయి-ఢిల్లీ హైజోక్‌ వ్యవహారంలో పరిస్థితిని ఎదుర్కోవడంలో విఫలమైన ఆరోపణలున్న పౌరవిమానయాన శాఖ మంత్రి షానవాజ్‌హుస్సెన్‌కు ఉద్వాసన చెప్పే అవకాశం వున్నదని ఆయన అంటున్నారు. జార్జ్‌ ఫెర్నాండెజ్‌ను మంత్రివర్గంలోకి తీసుకునే విషయంలో మాత్రం వాజ్‌పేయి నిర్ణయం తీసుకోలేదు. తెహల్కా కుంభకోణంతర్వాత జార్జ్‌ రాజీనామా చేసిన విషయం విదితమే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X