వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాజా దాడుల్లో భారీ ప్రాణనష్టం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ః అఎn్గాన్‌ పై అమెరికా తాజా దాడుల్లో భారీ ఎత్తున విధ్వంసం జరిగినట్టుగా చెబుతున్నారు. గురువారం రాత్రంతా నిర్విరామంగా దాడులు జరిపిన అమెరికన్‌ యుద్ధవిమానాలు శుక్రవారం మధ్యాహ్నం వరకు దాడులు కొనసాగించాయి.

పెద్దఎత్తున ప్రాణనష్టం, ఆస్తి నష్టంజరిగినట్టుగా తాలిబన్‌ ప్రతినిధులు చెబుతున్నారు. కదమ్‌ గ్రామంపీనుగుల పెంటగా మారిందని వారు పేర్కొన్నారు. గత 24 గంటల దాడుల్లోనే కనీసం 140 మంది మరణించినట్టుగా తాలిబన్లు చెబుతున్నారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 300 దాటిందని వారు చెప్పారు. క్షతగాత్రుల సంఖ్య లెక్కకుమించి వున్నదని వారు వెల్లడించారు. గాయపడిన వారికి వైద్య సహాయం కూడాఅందడం లేదు. వైద్య సదుపాయాలు, ఔషధాలుఅందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులు పరిస్థితి దారుణంగా వుంది. శుక్రవారం నాటి దాడుల తర్వాత కాబూల్‌ పట్టణం పూర్తిగా దెబ్బతిన్నది.

అనేక కట్టడాలు ధ్వంసమయ్యాయి.అయిదు అమెరికా యుద్ధ విమానాలు కాబూల్‌ విమానాశ్రయంపై ఏకకాలంలో బాంబుల వర్షం కురిపించాయి. పౌరఆవాసాలపై కూడా అమెరికన్‌ బాంబర్లు నిర్ధాక్షిణ్యంగా దాడులు చేస్తున్నట్టుగా వారు చెబుతున్నారు. గ్రామాలకు గ్రామాలు నాశనమై పోతున్నాయని, గుహలు, కొండప్రాంతాలు చిన్నాభిన్నమై పోతున్నాయని వారు ఆరోపించారు.కేవ్‌ బస్టర్స్‌, భారీ క్షిపణుల ప్రయోగంతో అఎ్ఘానిస్తాన్‌అంతా శిథిలాల కుప్పగా మారింది. తాలిబన్ల సైనికసంపత్తి పూర్తిగా ధ్వంసమైందని చెబుతున్న అమెరికన్లు లాడెన్‌ను పట్టుకునేవిషయంలో మాత్రం ఏ మాత్రం ధీమాగా లేరు. లాడెన్‌ తమ చేజిక్కాలంటే కనీసం రెండేళ్లు పడుతుందనిఅంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X