వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అఎn్ఘాన్లో160 మృతదేహాల వెలికితీత
ఇస్లామాబాద్: అమెరికా వైమానిక దాడుల్లో తూర్పుఅఎn్ఘానిస్థాన్లోని ఒక గ్రామంలో మరణించినవారిలో 160 మంది మృతదేహాలు వెలికి తీశారు. ఇప్పటి వరకు 160 మృతదేహాలను వెలికి తీసినట్లు, మృతుల్లో ఎక్కువగా మహిళలు, పిల్లలే వున్నారని తాలిబాన్ అధికార ప్రతినిధి చెప్పారు. మేం ఎక్కువ చేసి చెప్పడం లేదు. మరిన్ని మృతదేహాలను వెలికి తీయాల్సి వున్నది. ఆ ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయ బృందాలు, స్థానికులు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి అని ఆయన అన్నారు.
గురువారం జరిగిన దాడుల్లో కదమ్ గ్రామంలో 200 మందికిపైగా మరణించి వుంటారని తాలిబాన్ అధికార వర్గాలంటున్నాయి. ఒసామాబిన్ లాడెన్కు కీలకమైన సైనిక స్థావరంపై వేయ తలపెట్టిన బాంబులు ఆ గ్రామంపై పడ్డాయి. ఈ గ్రామంజలాలాబాద్కు పశ్చిమ దిశలో 40 కిలోమీటర్లు వుంటుంది.
Comments
Story first published: Friday, October 12, 2001, 23:53 [IST]