వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌ అత్యంత ప్రమాద స్థలి: అమెరికా

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికా యుద్ధం నేపథ్యంలో భారత, పాకిస్థాన్‌ల మధ్యపెరిగిన ఉద్రిక్తతలు కాశ్మీర్‌లోని వివాదాస్పదమైన హిమాలయ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా మార్చివేశాయని అమెరికా ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌పై తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నదని పావెల్‌ డిప్యూటీసెక్రటరీ రిచర్డ్‌ ఆర్మిటాగ్‌ గురువారం విలేకరులతో అన్నారు.

పావెల్‌ దక్షిణాసియా పర్యటనలో పాకిస్థానీల, భారతీయుల ఆలోచనలను తెలుసుకుంటారని, ఉద్రిక్తతలను తగ్గించడానికి మార్గాలేమైనా ఉన్నాయా అనేఅంశాన్ని పరిశీలిస్తారని ఆయన అన్నారు. అణ్వాయుధ ప్రత్యర్థులయిన పాకిస్థాన్‌, భారత్‌ల ఎదురుబొదురు వుండడం వల్ల కాశ్మీర్‌ అత్యంత ప్రమాద ప్రాంతంగా మారిందని దశాబ్దం కిందటే సిఐఎ డైరెక్టర్‌విలయం వెబ్‌స్టర్‌ చెప్పారని ఆయన గుర్తు చేశారు. పదకొండేళ్ల కిందటి వెబ్‌స్టర్‌ మాటలు సత్యాలని, ఆ మాటలు ఇప్పటికీ వర్తిస్తాయని,అందువల్లనే పావెల్‌ దక్షిణాసియా పర్యటన చేస్తున్నారని ఆయనవివరించారు. సెప్టెంబర్‌ 11వ తేదీన అమెరికాలో టెర్రరిస్టు దాడులు జరిగి, ఆ తర్వాత ఉగ్రవాదంపై అమెరికా యుద్ధం ప్రకటించిన తర్వాతపాక్‌, భారత్‌ల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X