పాతబస్తీలో ఉద్రిక్తత
హైదరాబాద్ః అఎn్గాన్ యుద్ధ వేడిమి హైదరాబాద్ను కూడా తాకింది. శుక్రవారం నాడు ప్రార్ధనల సందర్భంగా పాతబస్తీలో ఉద్రిక్తత చెలరేగింది. అఎn్గాన్ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం నాడు మసీదులకు వెళ్లిన వేలాది మంది ముస్లీంలు ప్రార్ధనలు ముగించుకుని వచ్చే సమయంలో గొడవ జరిగే అవకాశాలు వున్నాయని అనుమానించిన పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు.
ప్రార్ధనలు ముగించుకుని వస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు రెచ్చిపోయి లాడెన్ అనుకూల నినాదాలు చేశారని తెలిసింది. అమెరికాకు వ్యతిరేకంగా, లాడెన్కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న వ్యక్తులు ఇతర ముస్లీంలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుండటంతో వారిని నిరోధించడానికి పోలీసులు జోక్యం చేసుకున్నారు.
దుండగులు పోలీసులపై రాళ్లువిసిరారని తెలిసింది. దాంతో పోలీసులు కూడా బలప్రయోగానికి దిగారు. ఈ ఘర్షణలో ఎసిపి ఉమాపతి గాయపడటంతో పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఎంతమంది గాయపడింది.వివరాలు ఇంకా అందాల్సివుంది. అధికారికంగా ఆంక్షలు ప్రకటించనప్పటికీ బస్సులు, ఇతర వాహనాలు పాతబస్తీ వైపు వెళ్లడం లేదు.