వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇప్పటికైనా దారికొస్తే మంచిది

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః తాలిబన్లు ఇప్పటికైనా బుద్ధితెచ్చుకుని లాడెన్‌ను తమకు అప్పగించడం మంచిందని అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్‌ మరోసారి హెచ్చరించారు. అమెరికా దెబ్బను రుచిచూసిన తాలిబన్లకు మొండితనం వీడకపోతే పరిణామాలు ఎలావుంటాయో ఇప్పటికైనా అర్ధం అయివుంటాయని ఆయన అన్నారు.

శుక్రవారం నాడు వైట్‌హౌస్‌ అధికార ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. న్యూయార్క్‌పైసెప్టెంబర్‌ 11న టెర్రరిస్టుల దాడి తర్వాత అధికారిక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో బుష్‌ మాట్లాడటం ఇదే ప్రధమం. లాడెన్‌ బతికివున్నాడో తమ దాడుల్లో మరణించాడో తనకు తెలియదని అయితే సజీవంగాఅయినా నిర్జీవంగా ఆయినా లాడెన్‌ను తమకు అప్పగించాల్సిందేనని బుష్‌పేర్కొన్నారు.

లాడెన్‌నుఅప్పగిస్తే అఎn్గాన్‌పై దాడుల విషయం పునరాలోచిస్తామని ఆయన చెప్పారు. గత ఆరురోజుల దాడుల్లో తాలిబన్లసైనిక పాటవం సర్వనాశనం అయిందని బుష్‌ చెప్పారు.విమానాశ్రయాలు, సైనిక స్థావరాలు, ఆయుధగిడ్డంగులు ధ్వంసం అయ్యాయని ఆయన చెప్పారు. తాలిబన్లు తమ డిమాండ్‌ను అంగీకరించకపోతే
అల్‌కైదాను పూర్తిగా ధ్వంసం చేసేవరకు తాము దాడులనువిరమించేది లేదని ఆయన చెప్పారు. అల్‌కైదా ఆర్ధిక ఆయువుపట్టును దెబ్బతీసేందుకువీలుగా వారి ఆస్తులను అమెరికా ఎక్కడికక్కడ స్తంభిపజేస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X