బాపట్లలో రామానాయుడి స్పోర్ట్స్విజన్
హైదరాబాద్: బాపట్ల పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ సినీ నిర్మాత డి. రామానాయుడు స్పోర్ట్స్విజన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారంనాడిక్కడ విడుదల చేశారు. బాపట్ల పార్లమెంటు నియోజకవర్గంలో క్రీడలను ప్రోత్సహించేందుకు రామానాయుడు 3 కోట్ల 45 లక్షల రూపాయలతో ఈవిజన్ను రూపొందించారు.
ఈవిజన్లో భాగంగా నియోజకవర్గంలో తొమ్మిది క్రీడా మైదానాలను నిర్మిస్తారు. ప్రస్తుతం 90 లక్షల రూపాయలేసి వ్యయంతో కారంచేడు, చీరాలల్లో క్రీడా మైదానాలు నిర్మాణమవుతున్నాయి. ఇంకొల్లు, వేటపాలెం, తదితర ప్రాంతాల్లో క్రీడా మైదానాలు నిర్మిస్తారు. క్రీడాకారులను, క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈవిజన్ను రూపొందించినట్లు రామానాయుడు చెప్పారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి తన వంతు సహాయంఅందించడానికే ఈ విజన్ను చేపట్టినట్లు ఆయన తెలిపారు.
బహుళ ప్రయోజనాల, ఇండోర్, అవుట్ డోర్ క్రీడా మైదానాల నిర్మాణాలను చేపడుతున్న రామానాయుడును ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. రామానాయుడుఅందరికీ ఆదర్శం కావాలని ఆయన అన్నారు.