జైష్పై నిషేధం
వాషింగ్టన్: పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న తీవ్రవాద సంస్థ జైష్-ఎ-మహమ్మద్ను అమెరికా,బ్రిటన్లు శుక్రవారం నిషేధించాయి. దాని ఆస్తులను స్తంభింపజేశాయి. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి కొలిన్ పావెల్ వచ్చే వారం పాకిస్థాన్, భారత్లలో పర్యటించునున్న నేపథ్యంలో అమెరికా,బ్రిటన్లు ఈ చర్య తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. జమ్మూకాశ్మీర్అసెంబ్లీపై ఈ నెల 1వ తేదీన జరిగిన దాడికి తామే బాధ్యులమని జైష్ ప్రకటించింది.అప్పటి నుంచి విధించాలని భారత్గట్టిగా డిమాండ్ చేస్తూ వస్తోంది.
జైష్పై అమెరికా, బ్రిటన్లు నిషేధం విధించడం పట్ల భారత్ శుక్రవారం రాత్రి హర్షం వ్యక్తం చేసింది. 1999లో ఇండియన్ఎయిర్లైన్స్ విమానం హైజాక్ సందర్భంగా ప్రయాణికులను విడిపించే నిమిత్తం భారత్ విడుదల చేసిన తీవ్రవాది మౌలానా మసూద్ అజహర్ జైష్ను స్థాపించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అజహర్ జైష్ స్థాపనను ప్రకటించినప్పటి నుంచి అది వేగంగావిస్తరించింది.
విధించడంతో
పాటు
తీవ్రవాదులకు
నిధులుఅందకుండా
కట్టడి
చేసి,
వారిని
ఆర్థిక
దిగ్బంధనంలోపెట్టే
దిశగా
అమెరికా,
బ్రిటన్లు
శుక్రవారం
మరిన్ని
చర్యలు
తీసుకున్నాయి.
తీవ్రవాదానికి
సహకరిస్తున్న
వ్యక్తులపై,
సంస్థలపై
నిషేధం
విధించేందుకు
ఉద్దేశించిన
జాబితాను
అమెరికావిస్తరించింది.
తాజాగా
39
పేర్లను
ఈ
జాబితాలో
చేర్చింది.
దీంతో
ఈ
జాబితాలోని
మొత్తం
సంస్థల,
వ్యక్తుల
సంఖ్య
66కుపెరిగింది.
మరోవైపు
బ్రిటన్
కూడా
తీవ్రవాదంతో
సంబంధాలున్న
మరో
37
సంస్థల,
వ్యక్తుల
ఆస్తులను
స్తంభింపజేసింది.