వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు ఇంకా తీవ్రవాద దాడుల భయం

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌: అమెరికాకు ఇంకా తీవ్రవాదుల దాడుల ప్రమాదం పొంచి వున్నదని అమెరికా అధ్యక్షుడు జార్జి డబ్ల్యు. బుష్‌ హెచ్చరించారు. అయితే తీవ్రవాదులు తమ దేశాన్ని అంత తేలికగా తీసుకోవడం సాధ్యం కాదని, ముస్లిం ప్రపంచంలో తమ దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసే పని చేశామని ఆయన అన్నారు.

అఎn్ఘానిస్థాన్‌లోని తాలిబాన్‌ పాలకులపై తాము చేస్తున్న పోరు ఉగ్రవాదంపై, దుష్టశక్తులపై మాత్రమేనని, ఇస్లాంపై కాదని ఆయన స్పష్టం చేశారు. మానవతా దృష్టికోణం నుంచి పిల్లలతో ప్రచారం నిర్వహించే తమ కార్యక్రమంలోఅఎn్ఘాన్‌లకు ఆహార పదార్థాలను అందించే కార్యక్రమం కూడా ఇమిడి వున్నదని ఆయన చెప్పారు.

వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై, పెంటగాన్‌పై గత నెల 11వ తేదీన దాడులకువిమానాలను హైజాక్‌ చేసిన వారే ఇస్లామ్‌ను కూడా హైజాక్‌ చేయాలనుకుంటున్నారని, అమాయకులను బలిగొనడం ఇస్లామ్‌కు కూడావిరుద్ధమని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X