కెన్యాపై భారత్ ఘనవిజయం
బ్లూమ్ఫాంటైన్: ముక్కోణపు వన్డే టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం ఇక్కడ కెన్యాతో జరిగిన క్రికెట్ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. పది వికెట్లతో తేడాతో భారత్విజయదుందుభి మోగించింది. కెన్యా నిర్దేశించిన 91 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక్కవికెట్ కూడా నష్టపోకుండా 11.3 ఓవర్లలో ఛేదించివిజయాన్ని కైవసం చేసుకుంది. షెహవాగ్ 43 బంతుల్లో 11 ఫోర్లతో 55 పరుగులు, దీప్దాస్ గుప్తా 32 బంతుల్లో నాలుగు ఫోర్లతో 24 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. భారత్కువిజయం సాధించినందుకు లభించిన పాయింట్లతో పాటు సునాయసంగావిజయం సాధించినందుకు అదనపు పాయింట్ కూడా లభించింది. దీంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రభాగాన నిలిచింది. 27 పరుగులు మాత్రమే ఇచ్చిన నాలుగువికెట్లు తీసుకున్న అజిత్ అగార్కర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
అంతకుముందుటాస్ గెలిచిన కెన్యా బ్యాటింగ్ను ఎంచుకుంది. అయితే భారత బౌలర్ల ధాటికి కెన్యా బ్యాట్స్మెన్ క్రీజ్ వద్ద నిలబడలేకపోయారు. కెన్యా బ్యాటింగ్ 37.1 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. ఆరంభంలోనే అజిత్అగార్కర్ వరుసగా మూడు వికెట్లు తీసుకుని కెన్యా జట్టును చావుదెబ్బ తీశాడు. అగార్కర్ ధాటికి తట్టుకోలేని కెన్యా 13 పరుగులకే మూడువికెట్లు కోల్పోయింది. 18 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి కెన్యా 41 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకానొక సమయంలో 50 పరుగులకే కెన్యా ఏడువికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత టోని సుజి కొలిన్స్ ఒటినోతో కలిసి కొంత మేరకు భారత బౌలర్లను ఎదుర్కోగలిగారు. మొత్తంమీద 90 పరుగులకే కెన్యా జట్టు కుప్పకూలింది.