వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమాయకులపై దాడులు: తాలిబాన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కాబూల్‌: అమెరికా శనివారం చేసిన దాడుల్లో నలుగురు పౌరులు మరణించారని, ఎనిమిది మంది గాయపడ్డారనిఅఎn్ఘాన్‌ ఇస్లామిక్‌ ప్రెస్‌ ప్రకటించింది.కాబూల్‌ విమానాశ్రయానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల ఖాలామీర్‌ అబాస్‌ గ్రామంపై అమెరికా బాంబులు ప్రయోగించింది. కాబూల్‌లోనివిమానాశ్రయం లక్ష్యంగా అమెరికా దాడులు నిర్వహించిందని పాకిస్థాన్‌కు చెందిన న్యూస్‌ ఏజెన్సీ చెప్పింది.

అమెరికా దాడుల్లో ఏడు గృహాలు ధ్వంసమయ్యాయని పాకిస్థాన్‌లోని తాలిబాన్‌ రాయబారి అబ్దుల్‌ సలామ్‌ జయీఫ్‌ చెప్పారు. అమెరికా అమాయకులను చంపుతోందని ఆయన ఆరోపించారు. దేశంలో అమెరికా బాంబులు కురిపిస్తోందని, అమెరికా ప్రతిచోటా బాంబులు ప్రయోగిస్తోందని, అమాయకులను హతమారుస్తున్నారని ఆయన అన్నారు.

తాలిబాన్‌లకు పట్టు ఉన్న కాందాహార్‌లో భారీ దాడులు జరిగాయి. క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించారు. నగరం శివార్లలోపెద్ద యెత్తున బాంబులు వేశారు.

ఏడెనిమిది క్షిపణి ప్రయోగాలను తాను లెక్కించానని, కాందహార్‌ పరిసరాల్లోవిమానాలు సంచరిస్తున్నాయని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారి మహమ్మద్‌ హమీద్‌ చెప్పారు. నగరం లోపల బాంబు ప్రయోగాలు జరగలేదు.విమానాశ్రయం దిశగా బాంబుల ప్రయోగం జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X