వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెహెల్కా టేపులు నిజమే: కమిషన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రక్షణ కుంభకోణానికి సంబంధించిన తెహెల్కా డాట్‌ కామ్‌ టేపుల యధార్థతను శంకించాల్సిన అవసరం లేదని ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న జస్టిస్‌ వెంకటస్వామి కమిషన్‌ స్పష్టం చేసింది. ఈ టేపులను నిపుణుల కమిటీ పరిశీలనకు పంపాలన్నవిజ్ఞప్తిని కమిషన్‌ త్రోసిపుచ్చింది. ఈ టేపుల్లో ఉద్దేశ్యపూర్వకంగా తెహెల్కా మార్పులు చేసిందనే ఆరోపణలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఎడిట్‌ చేయని ఆ టేపులను ఈ దశలో నిపుణుల కమిటీకి పంపించడం తగని పని జస్టిస్‌ వెంకటస్వామి శుక్రవారం అన్నారు.

జస్టిస్‌ వెంకటస్వామి కమిషన్‌ ప్రకటనతో వాజ్‌పేయి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఆయుధ కంపెనీ ఏజెంట్లుగా నటించిన తెహెల్కావిలేకరుల నుంచి డబ్బు తీసుకుంటూ పట్టుబడిన బంగారు లక్ష్మణ్‌ బిజెపి జాతీయాధ్యక్ష పదవికిస్వస్తి చెప్పాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయనకు కేంద్రం పునరావాసం కల్పించింది. తనను కావాలని ఇరికించారని, తాను అనని మాటలనుఅందులో చేర్చారని బంగారు లక్ష్మణ్‌ ఇంతకాలం వాదిస్తూ వచ్చారు. సమతా పార్టీ నేతలు జార్జి ఫెర్నాండెజ్‌, జయా జైట్లీ కూడా తెహెల్కాపై అదే విధమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X