వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరిన్ని విమానదాడులకు హెచ్చరిక

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌ః న్యూయార్క్‌లోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై సెప్టెంబర్‌ 11న జరిపి దాడుల తరహాలో మరిన్న విమానదాడులను జరుపనున్నట్టుగా ఒసమాబిన్‌ లాడెన్‌ సొంత సంస్థ అల్‌కైదా అమెరికాను తీవ్రంగా హెచ్చరించింది.

అమెరికా,బ్రిటన్‌లో వున్న ముస్లీంలు, అమెరికా విధానాలను వ్యతిరేకించేవారు కొద్ది కాలం పాటువిమానయానానికి దూరంగా వుండాలని కూడా సంస్థ హెచ్చరించింది. అల్‌కైదా ప్రతినిధి సులేమాన్‌ అబూ ఘైత్‌ ప్రసంగించిన టేపును అల్‌ జజీరా ప్రసారం చేసింది.అరబ్బు భూభాగం నుంచి అమెరికా, బ్రిటన్‌ దళాలు వైదొలగాలని అల్‌కైదా డిమాండ్‌ చేసింది.

విమానదాడుల్లో ప్రాణర్పణకు వేలాది మంది ముస్లీం యువకులు సిద్ధంగా వున్నారంటూ తాము చేసిన ప్రకటనపై అమెరికా విదేశాంగ మంత్రి కొలెన్‌ పావెల్‌ సందేహాలు వ్యక్తం చేయడాన్ని ప్రస్తావిస్తూ అనుభవపూర్వకంగా అమెరికన్లే తమ హెచ్చరికలోని నిజానిజాలను తెలుసుకుంటారని ఆయన అల్‌కైదాపేర్కొంది. అల్‌కైదా ఒక హెచ్చరిక చేసిందంటే చేసి చూపిస్తుందని అల్‌కైదా ప్రతినిధి చెప్పారు. అమెరికా బుద్ధి తెచ్చుకుని తమ దారికి వచ్చేంతవరకువిమాన విధ్వంసం ఆగదని అల్‌కైదా చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X