వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగని బాంబుల వర్షం

By Staff
|
Google Oneindia TeluguNews

కాబూల్‌ః అఎn్గాన్‌పై ఆదివారం నాడు పగలంతా కూడా బాంబులవర్షం కురుస్తునే వుంది. శనివారం రాత్రంతా నిర్విరామంగా దాడులు జరిపిన అమెరికా యుద్ధ విమానాలు ఆదివారం నాడు దాడలను మరింత ముమ్మరంగా కొనసాగించాయి.

కాబూల్‌, కాందహార్‌,జలాలాబాద్‌ తోపాటు మరో అరడజనుపట్టణాలపై అదేపనిగా బాంబుల వర్షం కురిపిస్తున్నట్టుగా కాబూల్‌లోని వర్గాలు చెప్పాయి. కాందహార్‌విమానాశ్రయంపై ఆదివారం నాడు మరోవిడత బాంబులు గుప్పించారు. మొన్నటి దాడులతోనే ఎక్కడికక్కడ ధ్వంసమైన కాబూల్‌విమానశ్రయంలో శిథిలాలను కూడా అమెరికన్‌ బాంబర్లు విడిచిపెట్టడం లేదు.

కాందహార్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్నక్వేష్లా జదీద్‌ సైనిక స్థావరాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఆదివారం ఈ స్థావరం దాడులు జరిగిప్పుడు స్థావరంలోసైనికులు ఎంతమంది వున్నది తెలియడం లేదు. దేశవ్యాప్తంగా ప్రాణనష్టంపెద్దఎత్తున వున్నట్టుగా తాలిబన్‌ వర్గాలు చెబుతున్నాయి. మృతుల సంఖ్య మూడువందలు దాటిందని తాలిబన్లు చెబుతున్న లెక్క తాత్కలికమైంది మాత్రమేనని మృతుల సంఖ్య చాలా ఎక్కువగా వుండే అవకాశం వున్నదని స్థానిక పౌరులుఅంటున్నారు. కొండప్రాంతాల్లోని ప్రతిగ్రామాన్ని టెర్రరిస్టు శిక్షణా కేంద్రంగానే భావించి దాడులు జరుపుతున్నారని దీనివల్లా ఆయా గ్రామాల్లోని అమాయకపౌరులు బతికి బయటపడివుంటారా అన్నది అనుమానమేనని వారుఅంటున్నారు. కాగా కాబూల్‌లో మాత్రం దాడుల సందర్భంగా ఒక బాంబు పొరపాటున పౌర ప్రాంతంలో పడిందని అమెరికా ప్రకటించినవిషయం విదితమే. నార్తర్న్‌ అలయెన్స్‌తో కూడా భీకరంగా పోరాటం సాగుతున్నట్టుగా తాలిబన్లు చెబుతున్నారు.ఇదిలా వుండగా ఒకపక్క బాంబుల వర్షం కురిపిస్తూనే మరోపక్క ఆహారం పొట్లాలను కూడా అమెరికాపెద్దఎత్తున జారవిడుస్తున్నది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X