వార్ నేత ఎన్కౌంటర్
హైదరాబాద్ః
పీపుల్స్వార్
ఖమ్మం
జిల్లా
కార్యదర్శి
సూర్యం
అలియాస్
అల్లం
నాగసత్యం
అలియాస్
భాస్కర్
పోలీసులతో
జరిగిన
ఎన్కౌంటర్లో
మరణించినట్టుగా
పోలీసులు
ప్రకటించారు.
అయితే
సూర్యంను
పోలీసులు
అరెస్టు
చేసి
కాల్చిచంపినట్టుగా
అనుమానాలు
వ్యక్తం
అవుతున్నాయి.
సూర్యంఅరెస్టయినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆదివారం నాడు కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వచ్చిన రోజునే సూర్యం ఎన్కౌంటర్లో మరణించినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో కొందరు నక్సలైట్ ప్రముఖులు చందాల కోసం తిరుగుతున్నవిషయం తెలిసి పోలీసు స్పెషల్ ఫోర్స్ రంగంలోకి దిగి గాలింపు ప్రారంభించింది. ఈ సందర్భంగా కారులో వెళ్లుతున్న సూర్యం పట్టుబడినట్టుగా చెబుతున్నారు. ఇదిలా వుండగా సూర్యం మరో ఇద్దరు నక్సలైట్లు టేకులపల్లి మండలం సంపత్నగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులుకు ఎదురుపడ్డారని పోలీసులను చూడగానే వార్ కార్యకర్తలు కాల్పులు ప్రారంభించారని పోలీసులు ఎదురుకాల్పులు జరపగా సూర్యం మరణించాడని మరో ఇద్దరు పారిపోయారని పోలీసులు ప్రకటించారు