వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్జ్‌కు స్వపక్షంలోనే వ్యతిరేకత

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః జార్జ్‌ ఫెర్నాండెజ్‌కు మళ్లీ రక్షణ మంత్రి పదవి ఇచ్చే అవకాశం వున్నదంటూ వెలువడిన వార్తలతో ఢిల్లీలో ఒక్కసారిగా రాజకీయ దుమారం రగిలింది. సోమ, మంగళవారాల్లో జరుపనున్న మంత్రివర్గ విస్తరణలో జార్జ్‌కు మళ్లీ రక్షణ శాఖను అప్పగించాలని ప్రధాని వాజ్‌పేయి నిర్ణయించినట్టుగా వార్తలు వచ్చాయి. ఫెర్నాండెజ్‌కు పదవి ఇచ్చే ప్రతిపాదన వుంటే దానిని విరమించుకోవడం మంచిదని కాంగ్రెస్‌, వామపక్షాలు స్పష్టం చేశాయి. విపక్షాలు మాత్రమే కాకుండా స్వయంగా సమతాపార్టీ ఎంపీ ప్రభునాథ్‌ సింగ్‌ కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.

తహల్కా టేపుల కుంభకోణంలోంచి క్లీన్‌చిట్‌తో బయటపడేవరకు జార్జ్‌ను మంత్రిమండిలోకి తీసుకోరాదని ప్రభునాధ్‌ సింగ్‌ సూచించారు. జార్జ్‌ కూడా మంత్రివర్గంలో చేరరాదని ఆయన అన్నారు. జార్జ్‌కు పదివి ఇచ్చేవిషయంలో ప్రధాని సుముఖంగా వున్న స్వపక్షమే మోకాలడ్డటం గమనార్హం. హోం మంత్రి అద్వానీ, ప్రస్తుతం రక్షణ శాఖను చూస్తున్న జస్వంత్‌ సింగ్‌ కూడా జార్జ్‌ నియామకాన్ని సమర్ధించారని తెలిసింది.

జార్జ్‌ ఫెర్నాండెజ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని కాంగ్రెస్‌ ప్రతినిధి జయపాల్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెహల్కా టేపుల వాస్తవికతను వెంకటస్వామి కమిషన్‌ ధృవీకరించిన రోజునే ఆయన్ను మంత్రి మండలిలోకి తీసుకోవాలని ప్రధాని నిర్ణయించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు.సిపిఐ, సిపిఎం కూడా విచారణ పూర్తయి నిర్దోషిగా రుజువైన తర్వాతనే జార్జ్‌కు మళ్లీ పదవి ఇస్తామని గతంలో ప్రధాని చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ప్రధాని మాటతప్పే ప్రయత్నాలు చేయడం మంచిదికాదని హెచ్చరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X