వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు మహిళ నేతగా నన్నపనేని

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః తెలుగుదేశం పార్టీ తన 11 అనుబంధ విభాగాల రాష్ట్ర కార్యవర్గాలను ప్రకటించింది. తెలుగుమహిళ నేతగా నన్నపనేని రాజకుమారిని నియమించారు. తెలుగుయువత అధ్యక్షునిగా చిత్తూరు జిల్లా పుంగనూరు మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథ్‌రెడ్డిని నియమించారు.

తెలుగుయువత కార్యదర్శిగాఅరవింద్‌కుమార్‌ గౌడ్‌, తెలుగుమహిళ కార్యదర్శిగా గుండు సుధారాణి(వరంగల్‌) నియమితులయ్యారు. కాగా తెలుగురైతు అధ్యక్షునిగా నిజాంషుగర్స్‌ మాజీ చైర్మన్‌ బద్దం నర్సారెడ్డి, కార్యదర్శఇగా అందె రాఘవరావు నియమితులయ్యారు. బిసిసెల్‌ అధ్యక్షునిగా మాజీ మంత్రి అంకెం ప్రభాకరరావు, కార్యదర్శిగా మాజీ మంత్రి ఎల్‌ రమణ నియమితులయ్యారు.ఎస్సీసెల్‌ అధ్యక్షునిగా మాజీ ఎమ్మెల్యే బక్క నర్సింలు, కార్యదర్శిగా వర్ల రామయ్య(కృష్ణా జిల్లా) ఎస్టీ సెల్‌ అధ్యక్ష కార్యదర్శులుగా ఎ చందూలాల్‌, నిమ్మక జయరాజ్‌ నియమితులయ్యారు. మైనార్టీసెల్‌ అధ్యక్షునిగా ఖలీల్‌ బాషా, కార్యదర్శిగా మీర్‌ హైదర్‌ అలీఖాన్‌ నియమితులయ్యారు. సాంస్కృతిక విభాగం అధ్యక్షునిగా కె నర్సింహులు నాయుడు, కార్యదర్శిగా సాయిబాబా, వాణిజ్య విభాగం అధ్యక్షునిగా కొత్త రమాకాంత్‌, కార్యదర్శిగా సిద్ధ రామారావు నియమితులయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X