వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ ప్రదర్శనల్లో భారీ హింస

By Staff
|
Google Oneindia TeluguNews

జకోబాబాద్‌ః అఎn్గాన్‌పై అమెరికా దాడులకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌లో జరుగుతున్న ఆందోళన హింసాత్మకమై మలుపులు తీసుకుంటున్నది. ఆదివారం నాడు ప్రదర్శనకారులు పోలీసులతో ఘర్షణకు దిగి హింసాకాండకు పాల్పడటంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించిగా మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.

జకోబాబాద్‌విమానాశ్రయాన్ని అమెరికాన్‌ బలగాలు ఉపయోగిస్తున్నాయంటూ వచ్చిన వార్తలతో రెచ్చిపోయిన ప్రదర్శకులు నినాదాలు చేస్తూ ర్యాలీ తీయడంతో పాటవిమానాశ్రయం వైపు దూసుకుపోయే ప్రయత్నం చేశారు.

కొందరు ప్రదర్శకులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు కాల్పులు కూడా జరిపారని పోలీసుఉన్నతాధికారులు చెప్పారు. వేల సంఖ్యలో వున్న ప్రదర్శకులు పోలీసు వలయాన్ని చేధించివిమానశ్రయంపై దాడికి సిద్ధం కావడంతో పోలీసులు కాల్పులు జరిపారని వారు తెలిపారు. జకోబాబాద్‌లో ప్రదర్శన జరిపిన వారిలో దేశంలోని ఇతర ప్రాంతాలనుంచి వచ్చిన అతివాద ఇస్లాం సంస్థలకు చెందిన సాయుధ సభ్యులు వున్నట్టుగా చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X