వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గరీబులే కాబూల్‌లోమిగిలారు

By Staff
|
Google Oneindia TeluguNews

కాబూల్‌ః వారం రోజులుగా అమెరికన్‌ వైమానికి దళం ఎడతెరపిలేకుండా కురిపిస్తున్న బాంబుల వర్షంతో ప్రాణభయంతోప్రజలంతా ఊరువాడ వదలిపారిపోతున్నారు. దరిద్రనారాయణులకు నెలవైన అఎn్గాన్‌లో దరిద్రుల్లోకెల్లా దరిద్రులు మాత్రమే ఇప్పుడు కాబూల్‌ వంటి పట్టణాల్లో మగిలారు.

ప్రాణాలు వున్నా పోయినా ఒక్కటే అన్న నిర్వేదం వారిని ఎటూ కదలనియ్యడం లేదు. ఇలాంటి కుటుంబాల్లోనిస్త్రీలు, పిల్లలు, వృద్ధులు అమెరికా విమానాలు భీకరంగా గర్జిస్తూ బాంబులు కురిపిస్తున్నప్పుడు ఏడ్పులు పెడబొబ్బలతో తమ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి నెలరోజులు కొనసాగితేవీరంతా ఆకలి, రోగాల బారిన పడి లేదంటే బాంబుల బారిన పడి మరణించడం ఖాయమనిఅంటున్నారు. అమెరికా టెర్రరిస్టులను శిక్షిస్తున్నాదో టెర్రరిస్టులను తయారు చేస్తున్నదో తమకుఅర్ధం కావడం లేదని ఈ నిర్భాగ్యులు అంటున్నారు. టెర్రరిస్టులతో టెర్రరిజంతో ఏ మాత్రం సంబంధం లేని తాము బలిపశువులుగా మారామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X