వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పథకాల అమలుకురూ. 152 కోట్లు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ఆదరణ, చేయూత, ముందడుగు, చైతన్యం, తదితర పథకాల అమలుకు అదనంగా 152 కోట్ల రూపాయలు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన సోమవారంనాడిక్క సమావేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. జన్మభూమిని ఏడాదికి రెండు సార్లు నిర్వహించాలని కూడా మంత్రి వర్గం నిర్ణయించింది. జన్మభూమి కార్యక్రమాల నిర్వహణను జిల్లా అభివృద్ధి సమీక్షా మండళ్లకుఅప్పగించాలని కూడా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది.విద్యుత్‌పై జిల్లా స్థాయి, నియోజకవర్గాల స్థాయి కమిటీలు వేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

జన్మభూమి కార్యక్రమంలోనే కాకుండా ఏడాదికి ఆరుసార్లు ఫించన్లు పంపిణీ చేయాలని, ఒక గ్యాస్‌ సిలిండర్‌ ఉన్న వినియోగదారులకు కిరోసిన్‌అందించడానికి అవసరమైన నిబంధనలు సవరించాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. జస్టిస్‌ పున్నయ్య కమిషన్‌ సూచనల మేరకు రాష్ట్ర స్థాయి ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ ఏర్పాటు చేస్తారు. ఎస్‌సి, ఎస్‌టి బ్యాక్‌లాగ్‌ పోస్టులను మార్చిలోగా భర్తీ చేయాలని కూడా నిర్ణయించింది.

నక్సల్స్‌ చేతిలో మరణించిన వ్యక్తి కుటంబంలో ఒకరికి నెల రోజులుగా ఉద్యోగం ఇవ్వాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. మహిళా బ్యాంకులనుపెంచాలని, ఐదు వేల గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని, నవంబర్‌ ఒకటవ తేదీ నుంచి అంటరానితనానికి వ్యతిరేకంగాపెద్ద యెత్తున ప్రచారం చేపట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X