వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాశ్మీర్‌లో భారీ విధ్వంసంః జైష్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః కాశ్మీర్‌లో భారీ ఎత్తున విధ్వంసం సృష్టించనున్నట్టుగా పాకిస్తాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ జైష్‌ ఎ మహమ్మద్‌ ప్రకటించింది. భారత్‌ ఒత్తిడి వల్లనే తమ ఆస్తులను అమెరికా స్తంభింపజేసిందని జైష్‌ ఆరోపించింది.

కాశ్మీర్‌లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకునేందుకు తాము భారత్‌ను చావు దెబ్బతీస్తామని జైష్‌ నేత మౌలానా మసూద్‌ అజార్‌ హెచ్చరించారు.జిహాద్‌ ప్రారంభించమని తమను ఎవరూ కోరలేదనిఅందువల్ల ఎవరు చెప్పినా జిహాద్‌ ఆగదని అజార్‌ స్పష్టం చేశారు.

భారత్‌ బలవంతం వల్లనే తమకు వ్యతిరేకంగా అమెరికా చర్యలు తీసుకుంటున్నదని ఆయన ఆరోపించారు. కాశ్మీర్‌ ప్రజలస్వాతంత్ర్య సంగ్రామాన్ని తుడిచిపెట్టేయాలని అమెరికా యోచిస్తున్నదనిఅందువల్ల తమపై ఆ దేశం విధించిన నిషేధాన్ని తాము తిరస్కరిస్తున్నామని ఆయన ప్రకటించారు. ప్రపంచం తమను టెర్రరిస్టులు అనుకున్నస్వాతంత్ర్య సమర యోధులు అనుకున్నా తాము పట్టించుకోమని ఆయన వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X