వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తీవ్రవాదులపై చర్య ఉధృతం: ఫెర్నాండెజ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోమిలిటెంట్లపై సైనిక చర్యను పెంచడం అనివార్యమని రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ అన్నారు. ఆఎn్ఘానిస్థాన్‌లోని ప్రస్తుత చర్యలు ఉగ్రవాదాన్నిపెంచి పోషించడానికి పాకిస్థాన్‌కు, తాలిబాన్‌కు, ఒసామాబిన్‌ లాడెన్‌కు మధ్య గల సంబంధాలను వెల్లడిస్తోందని ఆయన అన్నారు. రక్షణ శాఖ మంత్రిగా సోమవారం రాత్రి పదవీ బాధ్యతలు చేపట్టిన ఫెర్నాండెజ్‌ పిటిఐ వార్తా సంస్థతో మాట్లాడారు.

మిలిటెంట్లపైసైనిక చర్యను పెంచడం అనివార్యమని, అయితేఅందుకు తగిన రూపాన్ని, సమయాన్ని, స్థలాన్ని ఎంపిక చేసుకోవడమేమిగిలిందని ఆయన అన్నారు. భారత్‌ ఉగ్రవాదంపై సొంతంగానే పోరు చేయాల్సి వుంటుందని అంతిమవిశ్లేషణలో తేలిందని, ఈ విషయంపై భ్రమలు అవసరం లేదని ఆయన అన్నారు.
ఉగ్రవాదంపై తాము పోరు సలుపుతున్నామని, నేరస్థుడు ఎలాగా నేరస్థుడో ఉగ్రవాది ఉగ్రవాదేనని ఆయన అన్నారు. ఉగ్రవాదంతో ఈ మతం కూడా ఏకం కాకూడదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X