వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మండిపడిన ప్రతిపక్షాలు

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః జార్జ్‌ ఫెర్నాండెజ్‌కు పిలిచి మంత్రివర్గంలో పీట వేయడానికి వాజ్‌పేయికి రాజకీయంగా ఏలాంటి కారణాలు వున్న ప్రతిపక్షాలు మాత్రం ప్రధాని నిర్ణయాన్ని తీవ్రంగా దుయ్యబట్టాయి. ఇది పూర్తిగా అనైతిక చర్య అని సిపిఎం నేత ప్రకాష్‌ కారత్‌ వ్యాఖ్యానించారు.

తెహల్కా ఆరోపణలతో కొందరు సైనికాధికారులపై చర్య తీసుకోవడం కూడా జరిగిందని ఈ సమయంలో జార్జ్‌పై ఆరోపణలు లేవని ప్రధాని అనడం విడ్డూరంగా వున్నదని ఆయన చెప్పారు. ఎన్‌డిఎలో భాగస్వామ్య పక్షాలన్నీ అధికారంలో వాటా కోరుతున్నాయని ఇందుకోసం ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. నైతికతకు పూర్తిస్థాయిలో తిలోదకాలు వదిలిన ప్రధానిగా వాజ్‌పేయి తనను తాను నిరూపించుకున్నారని కాంగ్రెస్‌ ప్రతినిధి జైపాల్‌రెడ్డివిమర్శించారు. మిత్రపక్షం బ్లాక్‌మెయిల్‌కు తలవొగ్గి నైతికతను బుట్టదాఖలు చేశారని ఆయన దుయ్యబట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X