ప్రధాని కోరికపైనే కేబినెట్లో చేరిక
న్యూఢిల్లీః
ప్రధాని
వాజ్పేయి
అభ్యర్ధన
మేరకే
తాను
కేంద్ర
కేబినెట్లో
చేరినట్టుగా
సమతా
పార్టీ
నేత
జార్జ్
ఫెర్నాండెజ్
స్పష్టం
చేశారు.
తాను
తిరిగి
కేబినెట్లో
చేరడంలో
నైతికతకు
సంబంధించిన
ప్రశ్నే
ఉత్పన్నం
కాదని
ఆయన
స్పష్టం
చేశారు.
వీధుల్లోకి వెళ్లి నినాదాలు చేసినంత మాత్రాన, సభలోవిపక్షాలు గొంతు చించుకున్నంత మాత్రాన తాను దోషిగా నిలబడలేనని ఆయనపేర్కొన్నారు. తనపై ఆధారాలు వుంటే వాటిని స్పష్టంగా చూపాలని ఆయన డిమాండ్ చేశారు. తహల్కా కుంభకోణంలో తనపై నేరుగా ఎటువంటి ఆరోపణలు లేవని ఆయన స్పష్టం చేశారు. నిరాధారంగా బురద చల్లినంత మాత్రానా తాను దోషినెలా అవుతానని ఆయన ప్రశ్నించారు. సమతా పార్టీపై తన పట్టు నిలుపుకునేందుకే ప్రధానిపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చి జార్జ్ మంత్రివర్గంలో చేరినట్టుగా చెబుతున్నారు. ఎక్కువ కాలం బయటవుంటే జార్జ్ ఎన్డిఎ ప్రభుత్వాన్ని కూల్చివేసే ప్రమాదం వున్నదన్న భయంతో బిజెపి నేతలు ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకున్నట్టుగా చెబుతున్నారు.