వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధికారం అయోధ్య భిక్షః బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం సాగుతున్న ఉద్యమంలో పాల్గొనడం సబబేనని బిజెపి స్పష్టం చేసింది.ఈ మేరకు పార్టీ జాతీయ మండలి ప్రత్యేక సమావేశంలో ఒక తీర్మానం చేశారు. రామజన్మభూమి ఉద్యమం బిజెపి భవిష్యత్తుకు రూపం ఇవ్వడంతో పాటు భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నదని తీర్మానంలో పేర్కొన్నారు.

పూర్వపు జనసంఘ్‌తో కలసి రాజకీయ పార్టీగా బిజెపిపేరుతో అవతరించి అయిదు దశాబ్దాలు గడిచిన సందర్భంగా ఏర్పాటు చేసినస్వర్ణోత్సవాల ప్రత్యేక సమావేశం అయోధ్య ఉద్యమాన్ని గట్టిగా సమర్ధించింది. ఉత్తరప్రదేశ్‌అసెంబ్లీ ఎన్నికల్లో మతరాజకీయం నుంచి గట్టిగా లబ్ది పొందడానికివీలుగా బిజెపి మళ్లీ అయోధ్యను లేవనత్తినట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ సమావేశంలో ప్రసంగించిన హోం మంత్రి అద్వానీ కూడా బిజెపి చేతికి దేశ అధికార సారధ్యం లభించడానికి రాముని దయనే కారణమని చెప్పారు. అయోధ్య ఉద్యమం వాస్తవిక లౌకిక వాదం. కుహనా లౌకికవాదం మధ్య వున్న అంతరాన్ని బట్టబయలు చేసిందని కూడా అద్వానీపేర్కొన్నారు. బిజెపి మార్గదర్శకత్వంలో భారత్‌ అంతర్జాతీయ శక్తిగా ఎదిగిందని కొనియాడారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X