తాలిబన్ల చెరలో జర్నలిస్టులు
కాబూల్ః అఎn్గాన్ యుద్ధాన్ని ప్రత్యక్షంగా కవర్ చేసేందుకు రహస్యంగా అఎn్గానిస్తాన్లో అడుగుపెట్టిన వివిధ దేశాలకు చెందిన 30 మంది పాత్రికేయులు ఇప్పుడు అఎn్గానిస్తాన్లో బందీలుగా వున్నారు. కాబూల్కు ఉత్తర ప్రాంతంలోని ఒక గిరిజన తెగ వీరిని నిర్బంధించినట్టుగా సమాచారం అందింది.
ఈ జర్నలిస్టుల్లో భారత్,బ్రిటన్, అమెరికా, జర్మనీ, రష్యా, బల్గేరియా, ఫ్రాన్స్, పశ్చిమాసియా దేశాలకు చెందిన వారు వున్నారు. ఉజ్బెకిస్తాన్ను భూభాగం నుంచి రహస్యంగా సరిహద్దులు దాడిఅఎn్గాన్లో ప్రవేశించగానే ఈ గిరిజనతెగ వారు వారిని బంధించినట్టుగా తెలిసింది.
ఈ గిరిజన తెగ తాలిబన్ అనుకూలవర్గమనిఅంటున్నారు. వెయ్యి డాలర్లు ఇస్తే ప్రాణాలతో వదిలేస్తామని తమను బంధించిన గిరిజనులు బెదిరిస్తున్నారని బల్గేరియాకు చెందిన జర్నలిస్టు శాటిలైట్ ఫోన్ ద్వారా తన కార్యాలయానికి వార్త చెరవేసినట్టుగా తెలిసింది. ఇదిలా వుండగా అంతర్జాతీయ జర్నలిస్టులంతా ఈ యుద్ధాన్ని నార్తర్న్ అలయెన్స్ నియంత్రణలో వున్న భూభాగం నుంచి మాత్రమే కవర్ చేస్తున్నారు. తాలిబన్లు విదేశీ జర్నలిస్టులను అనుమతించడం లేదు.