కిడ్నాప్ కథ సుఖాంతం
బెంగుళూరుః హైదరాబాద్కు చెందిన మూడుళ్ల చిన్నారి ప్రత్యూష కిడ్నాప్ వ్యవహారం సుఖాంతంగా ముగిసింది. వారం రోజుల క్రితం హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రశాంత్ కుమార్తెను వారింట్లోనే కారు డ్రైవర్గా పనిచేస్తున్న సూర్యప్రకాష్నాయుడు అనే వ్యక్తి అపహరించుకుపోయాడు.
ప్రశాంత్ ఇంటి ఔట్హౌస్లోని నాయుడు గదిలో క్షద్ర శక్తులకు సంబంధించిన పుస్తకాలు దొరకడంతో బాలిక ప్రాణాలకుఅపకారం జరిగే అవకాశం వున్నదన్న అనుమానంతో గతమంగళవారం అమావాస్య రోజు రాష్ట్ర పోలీసులు శ్మశానాలు గాలించారు. కొన్ని ప్రత్యేక పోలీసు బృందాలు చిత్తూరు జిల్లాలోని నాయుడుస్వగ్రామానికి బయలు దేరి వెళ్లాయి. బెంగుళూరులో ప్రశాంత్ కారు దొరకడంతో నగర పోలీసులు బెంగుళూరు కూడా బయలుదేరి వెళ్లారు.
తమిళనాడు,
కర్ణాటక,
ఆంధప్రదేశ్
సరిహద్దుల్లో
నాయుడు
చుట్టపక్కాలు
వున్న
గ్రామాల్లో
గాలింపు
జరుపుతుండగా
తమిళనాడులో
గుడియాత్తం
నుంచి
కిడ్నాపర్లు
పాతిక
లక్షల
రూపాయలు
డిమాండ్
చేస్తూ
ఫోన్
చేశారు.
ఈ
ఫోన్
కాల్
ఆధారంగా
పోలీసులు
గుడియాత్తం
లోని
హోటల్పై
దాడి
చేసి
నాయుడును
ఈ
కిడ్నాప్లో
నాయుడుకు
సహకరించిన
మరో
ఇద్దరు
శ్రీనివాసులు,సురేష్ను
కూడా
అరెస్టు
చేశారు.
ప్రత్యూషను
క్షేమంగా
తల్లిఒడి
చేర్చిన
నగరపోలీసు
బృందాన్ని
అభినందించడంతో
పాటు
వారికి
నగదు
బహుమతిని
కమిషనర్
ప్రకటించారు.