వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జిహాద్కు ఒమర్ మరోసారి పిలుపు
కాబూల్: అమెరికా వ్యతిరేక పోరులో మరణించిన వారు దైవానుగ్రహానికి పాత్రులయ్యారని, వారికిస్వర్గ సౌఖ్యం ప్రాప్తించిందని తాలిబాన్ నేత ముల్లా మహ్మద్ ఉమర్ అన్నారు. కేంద్రంలో, ఉత్తరఅఎn్ఘానిస్థాన్లో అమెరికా అనుకూల శక్తులకు వ్యతిరేకంగా ఇస్లామిక్ ఎమరేట్ ముజాహిదీన్ శక్తులు దృఢంగా నిలబడ్డాయని, అమెరికా దాడులు చేస్తున్నా ఈ శక్తులు దృఢచిత్తంతో నిలబడే దైవానుగ్రహం పొందాయని ఆయన అన్నారు.
ప్రపంచ ముస్లింలంతాజిహాద్కు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. పాకిస్థాన్లోని తాలిబాన్ అనుకూల ప్రదర్శనల్లోఅసువులు బాసినవారిని ఆయన కొనియాడారు. పవిత్ర మార్గంలో సంభవించే మరణం అమరత్వాన్ని ప్రసాదిస్తుందని,స్వర్గ సౌఖ్యాలకు అమరులు పాత్రులవుతారని ఆయన అన్నారు.
Comments
Story first published: Monday, October 22, 2001, 23:53 [IST]