వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పాక్లోవిదేశీయుల అరెస్టు
ఇస్లామాబాద్ః పాకిస్తాన్ పెద్దఎత్తున విదేశీయులను అరెస్టు చేసే కార్యక్రమంలో పడింది. సరైన పత్రాలు లేకుండా తమ దేశంలో నివసిస్తున్న ఆరోపణలతో ఆదివారం నాడు 56 మంది విదేశీ పౌరులను అరెస్టు చేసింది.
అరెస్టయిన వారిలో సొమాలియా, ఇరాన్, నైజెరియా, గ్రీస్,అఎn్గానిస్తాన్ దేశాలకు చెందిన వారు వున్నారు. దేశీయంగా కూడా భద్రతను పాకిస్తాన్ ప్రభుత్వం కట్టుదిట్టం చేసింది. అమెరికా దాడులతో నడుములువిరిగిన తాలిబన్లు ప్రతీకారంతో పాకిస్తాన్లో విధ్వంసం సృష్టించే అవకాశం వున్నదన్న భయం పాకిస్తాన్ ప్రభుత్వంలో కనిపిస్తున్నది. ఇస్లామాబాద్విమానాశ్రయం పేల్చివేతకు జరిగిన కుట్ర బయటపడిన తర్వాత ప్రభుత్వం మరింత జాగ్రత్త తీసుకుంటున్నది.విమానాశ్రయాల చుట్టుపక్కలకు కూడా ఎవరినీ అనుమతివ్వడం లేదు.
Comments
Story first published: Monday, October 22, 2001, 23:53 [IST]