వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శరణార్ధులను అడ్డుకోవద్దు

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః అమెరికా దాడులతో బెంబేలెత్తిన అఎn్గాన్‌ శరణార్ధులు తమదేశంలోకి వరదలా వచ్చిపడుతుండటంతో పాకిస్తాన్‌ ప్రభుత్వం సరిహద్దుల్లో నిఘాను, భద్రతను కట్టుదిట్టం చేసింది.

అఎn్గాన్‌ శరణార్ధులు సరిహద్దులను ఉల్లంఘించి తమ భూభాగంలో అడుగుపెట్టకుండాపెద్దఎత్తున సైనిక బలగాలను మొహరించింది. దాంతో సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్‌సైనికులు తమను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మానవస్మగ్లర్ల సారధ్యంలోఅఎn్గాన్లు దాడులకు దిగడంతో పాకిస్తాన్‌ సైనికులు కూడా ఎదురుదాడులు జరుపుతున్నారు. పరస్పరం రాళ్లురువ్వుకుంటున్న సంఘటనలు సరిహద్దుల్లోని పలుప్రాంతాల్లో జరిగాయనిఅంటున్నారు.

మరోవైపు చమన్‌ సరిహద్దు పోస్ట్‌ వద్ద చిక్కుబడిపోయిన 15000 మందిఅఎn్గాన్‌ పౌరులను పాకిస్తాన్‌లో అడుగుపెట్టడానికి అవకాశం కల్పించాలని ఐక్యరాజ్యసమితి సహాయక బృందాలు పాకిస్తాన్‌ ప్రభుత్వానికివిజ్ఞప్తి చేశాయి. ఈ ప్రాంతంలో ఐరాస బృందాలు శరణార్దులకు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నది కూడా.అఎn్గాన్‌పై అమెరికా దాడి ప్రారంభించిన నాటినుంచే ఉభయదేశాల మధ్య సరిహద్దులు అధికారికంగా మూసివేశారు.అయినప్పటికీ అక్రమమార్గాల్లో వేలాది మంది ఇప్పటికే పాకిస్తాన్‌లో అడుగుపెట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X