వాజ్పేయి చింత
న్యూఢిల్లీః
బిజెపికి
ప్రభుత్వానికి
మధ్య
అంతరం
పెరుగుతున్నదని
ప్రధాని
వాజ్పేయి
ఆందోళన
వ్యక్తం
చేశారు.
జనసంఘ్-బిజెపి
స్వర్ణోత్సవాల
సందర్భంగా
నిర్వహించిన
పార్టీ
జాతీయ
మండలి
ప్రత్యేక
సమావేశాల
ముగింపు
కార్యక్రమంలో
ఆయన
పాల్గొన్నారు.
ఉదయం జరిగిన పార్టీ పతాకావిష్కరణ సమావేశానికిహాజరుకానందుకు క్షమాపణలు చెప్పిన ప్రధాని, పార్టీకి ప్రభుత్వానికి మధ్య అంతరం పెరుగుతున్నదనడానికి అనేక ఉదాహరణలు వున్నాయని చెప్పారు. కార్యక్రమం షెడ్యూల్లో ప్రారంభోత్సవ వేడుకల్లో కాకుండా తనపేరును ముగింపు కార్యక్రమంలో చేర్చడాన్ని ప్రధాని చమత్కారంగానైనా తప్పుబట్టారు.
దీనివల్లనే తాను కార్యక్రమం శుభారంభానికి రాలేకపోయానని ఆయన చెప్పారు. మార్గదర్శక సందేశానికి అద్వానీని వందన సమర్పనకు తనను అహ్వానించారని ఆయన అన్నప్పుడు సభలో నవ్వుల జల్లులువిరిసినప్పటికీ ఈ మాటల వెనక వాజ్పేయి ఆవేదన కనిపించింది. పార్టీకి ప్రభుత్వానికి మధ్య అగాధం పెరుగుతున్నదనడానికి ఇదో సూచన అని ఆయన చెప్పారు.