వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైమానిక దాడులకువిరామం

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః పదిహేను రోజుల పాటు నిర్విరామంగా సాగిన వైమానికి దాడులతో అఎn్గాన్‌ను అతలాకుతలం చేసిన అమెరికా సోమవారం నాడు వైమానిక దాడులకు విరామం ప్రకటించింది. ఇప్పుడు దృష్టినంతా భూతల యుద్ధంపై కేంద్రీకరించింది.

సోమవారం నాడు కూడాపెద్దసంఖ్యలో అమెరికా యుద్ధ విమానాలు అఎn్గాన్‌ గగనతలంలో చక్కర్లు కొట్టినప్పటికీ బాంబులు మాత్రం గుప్పించలేదు. తమకు తెలిసిన టార్గెట్లన్నింటిని ధ్వంసం చేసిన అమెరికా కొండల్లో దాక్కున్నబిన్‌లాడెన్‌ను, ముల్లా ఒమర్‌ను బయటకు లాగడానికి భూతలపోరాటమే మార్గమని భావిస్తున్నది.

యుద్ధం రెండో దశ ప్రారంభమైనట్టు అమెరికా వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.బ్రిటన్‌ కూడా తన పదాతిదళాలను రంగంలోకి దించింది. నార్తర్న్‌ అలయెన్స్‌ దళాలు కీలకమైన మజారే షరీఫ్‌ పట్టణాన్ని చుట్టుముట్టాయని అమెరికన్‌ వర్గాలు చెప్పాయి. మజారే షరీఫ్‌నుస్వాధీనం చేసుకోవడానికి సంబంధించి అమెరికన్‌ కమెండోలు రూపొందించిన ఒక వ్యూహాన్ని నార్తర్న్‌ అలయెన్స్‌ దళాలు అమలుచేయనున్నట్టుగా అమెరికా ప్రతినిధి చెప్పారు. ఇదిలా వుండగా పాకిస్తాన్‌లో అమెరికాపెద్దఎత్తున తమ పదాతి దళాలను దింపింది. వివిధసైనిక కేంద్రాల్లో కనీసం రెండు మూడు వేల మందిసైనికులు దిగినట్టుగా సమాచారం అందింది. పాకిస్తాన్‌అఎn్గానిస్తాన్‌ సరిహద్దుల్లో వున్న వివిధ విమానాశ్రయాల్లో కనీసం యాభై,అరవై అమెరికా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు దిగినట్టుగా చెబుతున్నారు. మరోవైపుఅరేబియా సముద్రంలో మొహరించిన యుద్ధ నౌక థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ నుంచిపెద్ద సంఖ్యలో యుద్ధవిమానాలు అఎn్గాన్‌ గగనతలంపైకి వెళ్లివస్తున్నాయి.

అఎn్గాన్‌లో కమెండోల ఆపరేషన్‌ ప్రారంభం కావడంతోనే లాడెన్‌ను హతమార్చాల్సిందిగా సిఐఎను ఆదేశిస్తూ అమెరికా అధ్యక్షుడు జార్జ్‌బుష్‌ ఉత్తర్వులు జారీచేసినట్టుగా తెలిసింది. లాడెన్‌ మరణశాసనంపై బుష్‌ సంతకం చేసినప్పటికీ తాము లాడెన్‌ను ప్రాణాలతో బంధించడానికే ప్రయత్నిస్తున్నట్టుగా అమెరికాసైనికవర్గాలు వెల్లడించాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X