వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బిజెపికి ప్రధాని షాక్
న్యూఢిల్లీః పార్టీకి, ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతున్నదంటూ సీనియర్ నాయకుడు, ప్రధాని వాజ్పేయి చేసిన వ్యాఖ్య బిజెపి వర్గాల్లో తీవ్ర కలవరం సృష్టించింది. జనసంఘ్-బిజెపి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధాని పార్టీకి ప్రభుత్వానికి మధ్య అగాధం పెరుగుతున్నట్టుగా వ్యాఖ్యానించిన విషయం విదితమే.
పార్టీకి ప్రభుత్వానికి మధ్య అద్భుతమైన సమన్వయం వున్నదని ప్రధానిఅసలు అలా అననే లేదని బిజెపి అధ్యక్షుడు జనా కృష్ణమూర్తివివరణ ఇచ్చారు. సోమవారం నాడు విలేకరుల సమావేశంలో పలువురువిలేకరులు, ప్రధాని పార్టీపై అంతఘాటుగా విరుచుకుపడటానికి కారణమేమిటని ప్రశ్నించడంతో వారికి సమాధానం చెప్పలేక ఆయన సతమతమయ్యారు. వారితో ఒకరకంగా గొడవకూడా పడ్డారు. పార్టీ వేడుకలో ప్రధానిసీరియస్గా మాట్లాడుతారని ఎలా అనుకుంటున్నారని ఎదురు ప్రశ్నించారు.
Comments
Story first published: Tuesday, October 23, 2001, 23:53 [IST]