రాష్ట్రానికి కేంద్ర బృందం: ప్రధాని
న్యూఢిల్లీ:
ఇటీవల
రాష్ట్రంలో
వరదల
వల్ల
జరిగిన
నష్టంఅంచనాకు
త్వరలో
కేంద్ర
పరిశీలక
బృందాన్ని
పంపుతామని
ప్రధాని
అటల్బిహారీ
వాజ్పేయి
చెప్పారు.
రాష్ట్ర
బిజెపి
శాసనసభ్యులు,
బిజెపి
నాయకులు
మంగళవారం
ప్రధానిని
కలుసుకున్నారు.
వరద
బాధితులకు
తగిన
సహాయంఅందించాలని
కోరుతూ
వారు
ప్రధానికి
ఒక
వినతి
పత్రం
సమర్పించారు.
ప్రకాశం,
నెల్లూరు,
కడప,
కర్నూలు,
అనంతపురం
జిల్లాల్లో
ఇటీవలి
భారీ
వరదలకు
నష్టపోయినవారిని
ప్రభుత్వాన్ని
అన్ని
రకాలుగా
ఆదుకుంటామని
ప్రధాని
హామీ
ఇచ్చినట్లు
కేంద్ర
పట్టణాభివృద్ధి
శాఖ
సహాయ
మంత్రి
బండారు
దత్తాత్రేయవిలేకరులకు
చెప్పారు.
పనికి
ఆహార
పథకాన్ని
వచ్చే
ఏడాది
మార్చి
నెల
వరకు
పొడిగిస్తామని
ప్రధాని
హామీ
ఇచ్చినట్లు
ఆయన
తెలిపారు.
వరదల్లో 95 మంది దాకా మరణించినట్లు, 55 వేల గృహాలు ధ్వంసమైనట్లు దత్తాత్రేయ చెప్పారు. మొత్తం నాలుగు లక్షల ఎకరాల్లో పంట నాశనమైందని ఆయన అన్నారు. ప్రాథమికఅంచనాల ప్రకారం వరదల నష్టం 500 కోట్ల రూపాయల వరకు వుంటుందని, ఈ నష్టం 900 కోట్ల నుంచి వేయి కోట్ల రూపాయల వరకుపెరగవచ్చునని ఆయన అన్నారు.
ఇదిలా వుండగా, రాష్ట్ర ఆర్థిక మంత్రి పి. అశోక్గజపతిరాజు నేతృత్వంలోని ఒక బృందం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అజిత్ సింగ్ను కలిసి వరద నష్టంపై ఒక వినతి పత్రం సమర్పించింది. వరద నష్టం 9, 400 కోట్ల రూపాయల దాకా వుంటుందని ఈ బృందం మంత్రికి తెలిపింది. ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హాతో చర్చించి నష్టంఅంచనాకు ఒక పరిశీలక బృందాన్ని పంపుతామని అజిత్ సింగ్ ఈ బృందానికి హామీ ఇచ్చారు.