వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హర్కత్‌ మిలిటెంట్ల శవాల తిరస్కరణ

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: అమెరికా దాడుల్లో మరణించిన 35 మంది హర్కత్‌-ఉల్‌- ముజాహిదీన్‌మిలిటెంట్లలో ఎనమండుగురి శవాలను పాకిస్థాన్‌ సరిహద్దు బలగాలు బుధవారంనాడు లోనికి అనుమతించలేదు. ఈ ఎనమండుగురు కూడా లాహోర్‌ నగరానికి చెందినవారు. ఇందులోసీనియర్‌ నేత ఉస్తాద్‌ ఫరూఖ్‌ కూడా వున్నాడు.

శవాలనుస్వాధీనం చేసుకోవద్దని తమకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలుఅందాయని బఖ్తియార్‌ ఖాన్‌ తూర్పు ప్రొవిన్స్‌లోని తోర్ఖం క్రాసింగ్‌ పాయింట్‌ అధికారి చెప్పారు.జిహాద్‌ చేయడానికి వారు కాబూల్‌లో ఉన్నారని రాడికల్‌ ఇస్లామిక్‌ జమియాత్‌-ఇ- ఇస్లామ్‌ మతగురువు ముఫ్తీ జమాల్‌ చెప్పారు.

లాడెన్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణపై హర్కత్‌ను అమెరికా ఇది వరకే నిషేధించింది. అమెరికా దాడిలో మరణించిన హర్కత్‌ కార్యకర్తల అంత్యక్రియలనుపెద్ద యెత్తున నిర్వహించడానికి తాలిబాన్‌ అనుకూల మత సంస్థలు ఏర్పాట్లు చేయడంతో అంతకు ముందు భద్రతనుపెంచారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X