దాడుల్లో 20 మంది శరణార్థుల మృతి
క్వయెట్టా: అమెరికా వైమానిక దాడుల్లో తొమ్మిది మంది పిల్లలతో పాటు 20 మంది పౌరులు మరణించారు. అమెరికా వైమానిక దాడుల నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తుండగావీరు మరణించినట్లు బతికి బయట పడి పాకిస్థాన్కు పారిపోయి వచ్చిన వారు చెప్పారు.
అఎn్ఘానిస్థాన్
దక్షిణాన
గల
తిరిన్
కోట్
శివారులో
ట్రాక్టర్,
ట్రయలర్లలో
ప్రయాణిస్తుండగా
బుధవారం
బాంబు
పడి
వారు
మరణించారు.
ఈ
దాడిలో
గాయపడిన
కొందరు
పాకిస్థాన్లోనిక్వయెట్టాలో
చికిత్స
పొందుతున్నారు.
మొదటి బాంబు పడిన వెంటనే 25 మంది అక్కడి నుంచి పారిపోవడానికి ట్రాక్టర్కు అనుబంధంగా వున్న ట్రయలర్లో ఎక్కారు. ట్రాక్టర్ తిరిన్ కోట దాటుతుండగా అమెరికా వైమానిక దాడులు జరిపిందని, ఇందులో 19 మంది మరణించారనిఫైజుల్ మహమ్మద్ చెప్పాడు. మహమ్మద్కు ఈ దాడిలో కాలు పోయింది. ఈ దాడిలో నలుగురు పిల్లలనుపోగొట్టుకున్న ఒక స్త్రీ ఆ తర్వాత మరణించిందని అతను చెప్పాడు. శరణార్థుల కాన్వాయ్లపై అమెరికా బాంబులు కురిపిస్తోందని తాలిబాన్ అధికారులు చెప్పారు.