వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దాడుల్లో 20 మంది శరణార్థుల మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

క్వయెట్టా: అమెరికా వైమానిక దాడుల్లో తొమ్మిది మంది పిల్లలతో పాటు 20 మంది పౌరులు మరణించారు. అమెరికా వైమానిక దాడుల నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తుండగావీరు మరణించినట్లు బతికి బయట పడి పాకిస్థాన్‌కు పారిపోయి వచ్చిన వారు చెప్పారు.

అఎn్ఘానిస్థాన్‌ దక్షిణాన గల తిరిన్‌ కోట్‌ శివారులో ట్రాక్టర్‌, ట్రయలర్‌లలో ప్రయాణిస్తుండగా బుధవారం బాంబు పడి వారు మరణించారు. ఈ దాడిలో గాయపడిన కొందరు పాకిస్థాన్‌లోనిక్వయెట్టాలో చికిత్స పొందుతున్నారు.

అమెరికా బాంబుల వర్షం ప్రారంభమైన వెంటనే ప్రజలు రక్షణ కోసం పరుగులు తీశారు. బాంబులు పడిన తర్వాత దుమ్ము ధూళి తప్ప మరేమీ లేవని, ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయని బాంబు దాడుల నుంచి తప్పించుకున్న వ్యక్తి ఒకరు చెప్పారు.

మొదటి బాంబు పడిన వెంటనే 25 మంది అక్కడి నుంచి పారిపోవడానికి ట్రాక్టర్‌కు అనుబంధంగా వున్న ట్రయలర్‌లో ఎక్కారు. ట్రాక్టర్‌ తిరిన్‌ కోట దాటుతుండగా అమెరికా వైమానిక దాడులు జరిపిందని, ఇందులో 19 మంది మరణించారనిఫైజుల్‌ మహమ్మద్‌ చెప్పాడు. మహమ్మద్‌కు ఈ దాడిలో కాలు పోయింది. ఈ దాడిలో నలుగురు పిల్లలనుపోగొట్టుకున్న ఒక స్త్రీ ఆ తర్వాత మరణించిందని అతను చెప్పాడు. శరణార్థుల కాన్వాయ్‌లపై అమెరికా బాంబులు కురిపిస్తోందని తాలిబాన్‌ అధికారులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X