వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రామంపై అమెరికా దాడి- 12 మంది మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

సమ్మెవిరమిస్తేనే చర్చలు: బాబు
హైదరాబాద్‌: సమ్మె విరమస్తేనే ఆర్టీసి కార్మికులతో చర్చలు జరుపుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఆర్టీసి సమ్మె వల్ల ఉత్పన్నమైన పరిస్థితి గురించి బుధవారం మంత్రి ఉపసంఘంతో చర్చించారు. ప్రభుత్వం 130 కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించినప్పటికీ ఆర్టీసి కార్మికులు సమ్మె కొనసాగించడంసరైంది కాదని ఆయన అన్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా బస్సుల సంఖ్యనుపెంచాలని మంత్రి వర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది.

ఆర్టీసి కార్మికుల నేతలతో చర్చలు జరపకూడదనేది ఏమీ లేదని, చర్చలకు ప్రభుత్వం ఇంతకు ముందు నాలుగైదు సార్లు ప్రాతిపదికను ఏర్పాటు చేసిందని రవాణా శాఖ మంత్రి బి.వి. మోహన్‌ రెడ్డి చెప్పారు. కార్మికులు డ్యూటీలో చేరితే సమస్యల గురించి మాట్లాడుకోవచ్చునని ఆయన అన్నారు.

ఇదిలావుంటే, ఆర్టీసి కార్మికుల సమ్మె రోజురోజుకూ ఉధృతమవుతోంది. ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరహార దీక్షలు చేపట్టనున్నట్లు ఐక్య కార్యాచరణ సమితి నాయకులు ప్రకటించారు. చట్టబద్దంగా సమ్మె చేస్తున్న కార్మికులపై ప్రభుత్వం దమనకాండకు దిగుతోందని వారువిమర్శించారు. ఆర్టీసి కార్మికులు బుధవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు, ర్యాలీలు నిర్వహించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X