రాయలసీమపై సబ్ కమిటీ: జనా
కర్నూలు:
రాయలసీమ
వెనుకబాటు
తనంపై
అధ్యయనానికి
ఒక
సబ్
కమిటీ
వేయాలని
రాష్ట్ర
భారతీయ
జనతా
పార్టీ
(బిజెపి)
నిర్ణయించింది.
రాష్ట్ర
బిజెపి
సమావేశాలను
బిజెపి
జాతీయాధ్యక్షుడు
జనా
కృష్ణమూర్తి
ఆదివారంనాడిక్కడ
ప్రారంభించారు.
ఈ
సబ్
కమిటీ
రాయలసీమ
వెనుకబాటుతనంపై
అధ్యయనం
చేసి
పార్టీకి
నివేదిక
సమర్పిస్తుందని
అంతకు
ముందు
ఆయనవిలేకరులతో
చెప్పారు.
తెలంగాణ
కన్నా
రాయలసీమ
వెనుకబడి
వున్నదని
ఆయన
అన్నారు.
ఈ
కమిటీలో
ఐదు
లేదా
ఏడుగురు
సభ్యులుంటారని
ఆయన
చెప్పారు.
ఈ
కమిటీలో
రాయలసీమకు
ప్రాతినిధ్యం
వహించే
వాళ్లు
సభ్యులుగా
వుంటారని,
నిర్ణీత
కాలవ్యవధిలో
ఈ
సబ్
కమిటీ
నివేదక
సమర్పిస్తుందని
ఆయన
చెప్పారు.
ఈ సమావేశంలో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డి, కేంద్ర మంత్రి కృష్ణంరాజు, పార్టీ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు, శాసనసభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
సొంత
బలానికి
ప్రణాళిక
తెలుగుదేశం
పార్టీతో
స్నేహాన్ని
కొనసాగిస్తూనే
రాష్ట్రంలో
సొంత
బలాన్ని
సంతరించుకోవాలని
రాష్ట్ర
భారతీయ
జనతా
పార్టీ
(బిజెపి)
నిర్ణయించింది.
రాష్ట్రంలో
తెలుగుదేశంతో
చెలిమిని
కొనసాగిస్తూనే
పార్టీనివిస్తరించుకోవడానికి
ఒక
ప్రణాళికను
సిద్ధం
చేస్తామని
బిజెపి
రాష్ట్రాధ్యక్షుడు
చిలకం
రామచంద్రారెడ్డివిలేకరులకు
చెప్పారు.
ఇందుకు
గాను
దున్న
గలిగేవానికే
భూమి
అనే
నినాదాన్ని
ముందుకు
తీసుకుపోవాలని
బిజెపి
భావిస్తోంది.
తెలంగాణలో
వేలాది
ఎకరాల
భూమి
బీడు
పడి
వున్నదని,
నక్సల్స్స్వాధీనం
చేసుకున్న
ఈ
భూములను
ఎవరూసేద్యం
చేయడం
లేదని,
ఈ
భూములను
ప్రభుత్వం
కొనుగోలు
చేసి
దళితులకు,
వెనుకబడిన
వర్గాలకు
పంచాలని
డిమాండ్
చేస్తామని
రామచంద్రా
రెడ్డి
చెప్పారు.