వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌లో చర్చిపై దాడి-16 మంది కాల్చివేత

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ తూర్పు పంజాబ్‌ ప్రోవిన్స్‌లోని ఒక కాథలిక్‌ చర్చిపై సాయుధులు ఆదివారం దాడి చేసి 16 మందిని కాల్చి చంపారు. మరో డజను మందిని గాయపరిచారు. ఆరుగురు గుర్తు తెలియని దుండగులు మూడు మోటారుసైకిళ్లపై వచ్చి బహవల్పూర్‌ చర్చిలో ప్రార్థనలు చేస్తున్నవారిపైవిచక్షణా రహితంగా బుల్లెట్ల వర్షం కురిపించారు.

కలష్నికోవ్‌రైఫిళ్లతో దుండగులు దాడి చేసి వెంటనే పారిపోయినట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడికి బాధ్యులమని ఇంత వరకు ఎవరూ ప్రకటించుకోలేదు. ఈ సంఘటనతో పాకిస్థాన్‌లోని మైనారిటీ కమ్యూనిటీలో తీవ్ర భయాందోళనలు చోటు చేసుకున్నాయి.అఎn్ఘానిస్థాన్‌పై అమెరికా దాడుల నేపథ్యంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకే ఈ దాడి జరిగి వుండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈవిషయం నిర్ధారణ కాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X