వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెనుకబడిన ప్రాంతాలపైఅధ్యయనం

By Staff
|
Google Oneindia TeluguNews

కర్నూలు: రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అధ్యయనానికి ఒక కమిటీ వేసి ఆ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర బారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది. ఈ మేరకు కార్యవర్గం ఒక తీర్మానం చేసింది. రెండు రోజుల రాష్ట్ర బిజెపి కార్యవర్గ సమావేశాలు సోమవారంనాడు ముగిశాయి.

రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల వెనుకబాటు తనంపై సమగ్రంగా అధ్యయనం చేసి ఈ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని నిర్ణయించినట్లు పార్టీ రాష్ట్రాధ్యక్షుడు చిలకం రామచంద్రారెడ్డివిలేకరులకు చెప్పారు. గ్రామాలకు తరలి వెళ్లి పార్టీని పటిష్టం చేయాలని కూడా బిజెపి నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. కులవివక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమానికి సహకరిస్తామని ఆయన చెప్పారు.

కేంద్ర పథకాల అమలు తీరును, నిధుల ఖర్చు తీరును పర్యవేక్షించి అవి సరిగా అమలయ్యేలా బిజెపి కార్యకర్తలు పర్యవేక్షిస్తారని, తద్వారా కేంద్ర పథకాలపై ప్రజలను చైతన్య పరుస్తారని ఆయన చెప్పారు. మొత్తం పది సమస్యల పరిష్కారానికి రాష్ట్ర బిజెపి కార్యవర్గం తీర్మానాలు చేసి ఆమోదించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X