వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌-పాక్‌ లు మళ్ళీ చర్చలు జరపాలి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః భారత్‌ -పాకిస్తాన్‌ లు మళ్ళీ చర్చలు ప్రారంభించాలని జర్మనీ ఛాన్సలర్‌షెర్డెర్‌ పిలుపునిచ్చారు. భారత దేశంలో రెండు రోజుల అధికారిక పర్యటన జరుపుతున్న ఆయనకు సోమవారం నాడు రాష్ట్రపతిభవనంలో ఘనస్వాగతం లభించింది. భారత్‌ పాకిస్తాన్‌ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు ఆగ్రా తరహా చర్చలు జరగాలనేదే నా ఆకాంక్ష అని ఆయన అన్నారు.

భారత ప్రధాని వాజ్‌పేయి, పాక్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ లు ఈ ఏడాది జూలైలో ఆగ్రాలో సమావేశమైనవిషయం విదితమే. ఈ రెండు దేశాల రెండేళ్ళ కాలంలో కలిసి చర్చలు జరపడం ఇదే ప్రథమం. కాశ్మీర్‌అంశంపై చిక్కుముడి వీడకపోవడంతో ఆగ్రా చర్చలువిఫలం అయ్యాయి. అయితే ఆగ్రా చర్చలు కొనసాగాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. జర్మన్‌ ఛాన్సలర్‌ పాకిస్తాన్‌, భారత్‌, చైనా, రష్యాలలో పర్యటిస్తున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X