జిహాద్కు పదివేల మంది సిద్ధం
లఘారేః
అమెరికా,
దాని
మిత్రదేశాలకు
వ్యతిరేకంగా
తాలిబన్
ప్రభుత్వం
సాగిస్తున్నయుద్ధంలో
పాలుపంచుకోవడానికి
వేలాది
మంది
సాయుధులు
పాకిస్తాన్
సరిహద్దుల్లో
పొంచుకుని
వున్నారు.
వీరంతా
గిరిజనతెగలకు
చెందిన
వారు.
పురాతన మైన కత్తులూ, కటార్లు మొదలుకొని అత్యాధునిక ఎకె 47 వంటి ఆయుధాల వరకు ధరించిన ఈ గిరిజన తెగలవారు అమెరికా వ్యతిరేక నినాదాలతో సరిహద్దులు దాటే ప్రయత్నంలో వున్నారు. పాకిస్తాన్ అధినేత ముషారఫ్ను కూడా వారు దుమ్మెత్తిపోస్తున్నారు.
సుమారు 10 వేల మందివరకు వున్న ఈజిహాదీల్లో బాలలు, వృద్ధులు, బలవంతులు, బలహీనులు అనే తెడా లేకుండా ఇస్లాంపై నమ్మకం వున్నవారంతా వుండటంవిశేషం. సత్తావుంటే తమను అఎn్గాన్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని వారు పాకిస్తాన్ అధికారులను కూడా సవాలు చేస్తున్నారు. తమను అడ్డుకునే ప్రయత్నం చేస్తేజిహాద్ ఇక్కడినుంచే ప్రారంభమవుతుందని వారు తీవ్రంగా హెచ్చరించారు. వ్యూహాత్మకమైన కారకొరం హైవేను వారు గతనాలుగురోజులుగా స్తంభింపజేయడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.