మసీదులోని మిలిటెంట్ కాల్చివేత
శ్రీనగర్:
జమ్మూ
కాశ్మీర్లోని
బద్గాం
జిల్లా
పంజాన్
గ్రామంలోని
మసీదులో
దాక్కున్నమిలిటెంట్ను
భారత
భద్రతా
దళాలు
సోమవారం
మధ్యాహ్నం
కాల్చి
చంపాయి.
దీంతో
48
గంటల
ఉత్కంఠకు
తెర
పడింది.
భారత
భద్రతా
దళాలకు
ఎదురుపడినమిలిటెంట్లు
కొంత
మంది
పారిపోగా
ఒకతను
మసీదులోకి
చొరబడ్డాడు.
లొంగిపోవాల్సిందిగా
భారత
బలగాలు
చేసిన
హెచ్చరికలను
అతను
బేఖాతరు
చేస్తూ
వచ్చాడు.
ఎట్టకేలకు
అతడు
భారత
భద్రతా
బలగాలు
చేతిలో
హతమయ్యాడు.
సోమవారంమిలిటెంట్కు, భారత భద్రతా బలగాలకు మధ్య హోరాహోరి ఎదురు కాల్పులు జరిగాయి. చివరకు లష్కర్-ఎ- తోయిబాకు చెందినమిలిటెంట్ హతమయ్యాడు. హతుడి మృతదేహాన్నిస్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద వున్న ఎకె- 47రైఫిల్ను కనుగొన్నారు. ఈ ఎదురు కాల్పుల్లో మసీదు పాక్షికంగాదెబ్బ తిన్నది.
మసీదు నుంచి మిలిటెంట్ను బయటకు రప్పించడానికి భారత భద్రతా బలగాలు ఆదివారం పలు టియర్ గ్యాస్షెల్స్ వదిలాయి. ప్రతిగా అతను గ్రేనేడ్లు విసిరాడు. ఆటోమేటిక్రైఫిల్తో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక స్పెషల్ పోలీసు ఆఫీసర్ గాయపడ్డాడు కూడా.