వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొలిక్కి రాని మార్తాండరావు కిడ్నాప్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చెన్నమనేనివిద్యాసాగర్‌ రావు బావ మరిది మార్తాండరావు కిడ్నాప్‌ వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆయనను జనశక్తి నక్సలైట్లు కిడ్నాప్‌ చేసి నాలుగు రోజులవుతోంది. అయితే, తాము మార్తాండరావును డబ్బుల కోసం కిడ్నాప్‌ చేయలేదని జనశక్తి జిల్లా నాయకుడు రణధీర్‌పేర సోమవారం ఒక ప్రకటన విడుదలయింది. మార్తాండరావు ఆధీనంలో ఉన్న భారీ భూమి పంపిణీ గురించి, కాంట్రాక్టులలో అక్రమాల గురించి మాట్లాడడానికి ఈ కిడ్నాప్‌ చేశామని ఆయన స్పష్టం చేశారు.

అయితే, మార్తాండరావును మంగళవారం రాత్రి లోగా ఎప్పుడైనా విడుదల చేయవచ్చునని ఆయన బంధువులు ఆశిస్తున్నారు. మార్తాండరావు విడుదలకు నక్సలైట్లకు, ఆయన బంధువులకు మధ్య సంప్రదింపులు జరుగుతూనే వున్నాయి. మార్తాండరావుకు ఏ విధమైన హానీ తలపెట్టవద్దని కోరెం గ్రామస్థులు నక్సలైట్లను కోరుతున్నారు. మానవతా దృష్టితో నక్సల్స్‌ మార్తాండరావును వదిలిపెడతారని ఆశిస్తున్నాట్లు ఆయన బంధువులు చెబుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X