వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఎn్ఘాన్‌ వైపుగా పాక్‌ గిరిజనులు...

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌:అఎn్ఘానిస్థాన్‌ వైపుగా పాకిస్థాన్‌లోని వేలాది మంది గిరిజనులు కదులుతున్నారు. అమెరికాకు వ్యతిరేకంగా జరిగే పోరులో పాల్గోనేందుకువీరు తాలిబాన్‌ సేనలతో కలిసిపోతారని భావిస్తున్నారు.వీరు అత్యధునాత మారణాయుధాలతో అఎn్ఘానిస్థాన్‌ వైపుగా కదులుతున్నారు.వీరు పాకిస్థాన్‌ పట్టణాన్ని ఒకదాన్ని స్వాధీనం చేసుకోవడమే కాకుండా ఒక జైలులోని 36 మంది ఖైదీలను విడుదల చేశారు.

ఇదిలా వుంటే, అమెరికా అఎn్ఘానిస్తాన్‌పై వైమానిక దాడులను నిర్వహించింది. కాందాహార్‌పై అమెరికా బాంబులు ప్రయోగించింది. తాలిబాన్‌ నేత ముల్లా మహ్మద్‌ ఒమర్‌, అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ కాందహార్‌లోనే ఉన్నారనే అనుమానంతో అమెరికా తన వైమానిక దాడులను కాందహార్‌పైనే కేంద్రీకరించింది.

తాలిబాన్‌ అనుకూల పాకిస్థానీ గిరిజనులు పాకిస్థాన్‌ ఉత్తరాన ఉన్నచిలాస్‌ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారని ఒక వార్తా సంస్థ ప్రత్యక్ష సాక్షుల మాటలను ఉటంకిస్తూ తెలియజేసింది. ఆటోమేటిక్‌రైఫిళ్లు, రాకెట్‌ లాంచర్లు, హ్యాండ్‌మేడ్‌ గన్‌లు, కత్తులు ధరించిన తాలిబాన్‌ అనుకూల గిరిజనులు ఈ పట్టణాన్నిస్వాధీనం చేసుకున్నట్లు ఆ వార్తా సంస్థ తెలియజేసింది.

అఎ్ఘానిస్థాన్‌పై అమెరికా దాడులకు మద్దతు తెలియజేయడాన్ని ఉపసంహరించుకోవాలని ఈ గిరిజనులు పాకిస్థాన్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.చిలాస్‌ పట్టణం పెషావర్‌ ఈశాన్య దిశలో 350 కిలోమీటర్ల దూరంలో వుంది. వరుసగా నాలుగవ రోజు కూడా కోరకోరం జాతీయ రహదారి తాలిబాన్‌ అనుకూల పాకిస్థాన్‌ల ఆధీనంలోనే ఉంది. తిరుగుబాటుదారులను తరిమి కొట్టి రహదారిపై రాకపోకలను పునరుద్ధరించడానికి బలగాలను పంపినట్లు పాకిస్థాన్‌ ఆంతరంగిక భద్రతా మంత్రిత్వ శాఖ తెలిపింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X