ఆర్టీసి సమ్మెలో ఉద్రిక్తతలు
హైదరాబాద్:
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర
రోడ్డు
రవాణా
సంస్థ(ఎపిఎస్ఆర్టిసి)
కార్మికుల
సమ్మె
సందర్భంగా
సోమవారం
పలు
చోట్ల
ఉద్రికత
చోటు
చేసుకుంది.
రాస్తారోకోలు,
ధర్నాలు,
పికెటింగ్లు,
లాఠీఛార్జీలు,అరెస్టులతో
రాష్ట్రంలోని
పలు
ప్రాంతాలు
అట్టుడికిపోయాయి.
తాత్కాలిక
ఉద్యోగులతో
నడిపించడానికి
ప్రయత్నించిన
బస్సులను
ఆర్టీసి
కార్మికులు
అడ్డుకున్నారు.
పలు
చోట్ల
రాస్తారోకోకు
దిగారు.
వందలాది
మందిని
పోలీసులుఅరెస్టు
చేశారు.
కరీంనగర్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష జరిగింది. ఆర్టీసి కార్మికులుఅర్థ నగ్న ప్రదర్శన చేశారు. శ్రీకాకుళంలో వామపక్షాల కార్యకర్తలు బైఠాయింపు జరిపి ట్రాఫిక్ను అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విజయవాడలో సిపిఐ, సిపిఎం కార్యకర్తలు ప్రయివేట్ బస్సుల టైర్లలో గాలి తీసేసి, బస్సులను అడ్డుకున్నారు. ఈ సందర్భంలో ఆందోళకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. దాదాపు వంద మందినిఅరెస్టు చేశారు. వరంగల్లో భారీ ప్రదర్శన జరిగింది. ఈ ప్రదర్శనను అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నించినప్పుడు ఉద్రిక్తత నెలకొంది.
అనంతపురంలో
ఆర్టీసి
కార్మిక
సంఘాల
ఐక్య
కార్యాచరణ
సమితి
(జెఎసి)
నేతలకు,
పోలీసులకు
మధ్య
వాగ్వివాదం
చెలరేగింది.
తిరుపతిలో
బస్సులు
నడవకుండా
అడ్డుకున్నారు.
హైదరాబాద్లో
వామపక్షాల
కార్యకర్తలు
బస్సులను
అడ్డుకున్నారు.పెద్ద
యెత్తున
పికెటింగ్
నిర్వహించారు.
దీంతో
పోలీసులు
దాదాపు
40
మందినిఅరెస్టు
చేశారు.
అరెస్టయినవారిలో
సిపిఐ,
సిపిఎంల
రాష్ట్ర
కార్యదర్శులు
సురవరం
సుధాకర్
రెడ్డి,
బి.వి.
రాఘవులు
కూడా
వున్నారు.