వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యుద్ధం ఆగదుః అమెరికా

By Staff
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్‌ః పాకిస్తాన్‌ లో ఆదివారం నాడు జరిగిన మారణహోమంపై అమెరికా మౌనముద్ర దాల్చింది. ఏది ఏమైనా యుద్ధం ఆపే ప్రసక్తి లేదని మాత్రం స్పష్టం చేసింది. పాకిస్తాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌ లోని ఓ కేథలిక్‌ చర్చిపై ముస్లిం తీవ్రవాదులు మెరిపుదాడి చేసి 18 మందిని కాల్చి చంపారు. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. పాక్‌ అధ్యక్షుడు ముషారఫ్‌ ఆఫ్ఘన్‌ పై యుద్ధంలో అమెరికాకు వంతపాడుతున్నందుకు నిరసనగా ముస్లింమిలిటెంట్లు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.

ఈ చర్యను పాక్‌ అధ్యక్షుడు జనరల్‌పర్వేజ్‌ ముషారఫ్‌ ఖండించారు. ఈ చర్యకు పాల్పడ్డ వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. మరోవైపు పాకిస్తాన్‌ లోని ముస్లిం ఛాందసవాద సంస్థలు ముషారఫ్‌ పై రణభేరి మోగించాయి. నిరసన ప్రదర్శనలతో పాకిస్తాన్‌ హోరెత్తిపోతున్నది. పాకిస్తాన్‌ కు చెందిన ఓ పట్టణాన్నికూడా ముస్లిం తీవ్రవాదులుస్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అమెరికాకు మద్దతిస్తున్నందుకు పాక్‌ లో ఎన్ని ఘర్షణలు చెలరేగినా.... ఆఫ్ఘన్‌ లో అమాయకులైన ప్రజలు, పసి పిల్లలు మరణించినా యుద్ధం ఆపేదని అమెరికా రక్షణ శాఖ మంత్రి రమ్స్‌ఫీల్డ్‌ ఆదివారం నాడు చేల్చి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X