వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ జైలు నుంచి బారత్‌ బేస్తల విడుదల

By Staff
|
Google Oneindia TeluguNews

కరాచి: పాకిస్థాన్‌ జైలు నుంచి 196 మంది భారత మత్స్యకారులు విడుదలయ్యారు. పాకిస్థాన్‌ సముద్ర జలాల్లోకి ప్రవేశించినందుకువీరిని అరెస్టు చేశారు. వీరు మంగళవారం సాయంత్రం 32 పడవల్లో భారత్‌ బయలు దేరుతారని పాకిస్థాన్‌ మత్స్యకారుల సహకార సంఘం అధికార ప్రతినిధి ఘజన్‌ఫర్‌ అలీ బూటా చెప్పారు.

భారత్‌ కూడా ఇదే తీరులో ప్రతిస్పందిస్తుందని ఆశిస్తున్నామని, భారత్‌ 202 మంది పాకిస్థాన్‌ మత్స్యకారులను అదుపులోకి తీసుకుందని ఆయన అన్నారు. తమ ప్రతినిధి బృందం త్వరలో భారత్‌ సందర్శిస్తుందని, 202 మంది తమ దేశ మత్స్యకారులను, 21 పడవలను భారత్‌ త్వరలో విడుదల చేస్తుందని భావిస్తున్నామని ఆయన అన్నారు.వీరిని భారత్‌ రంజాన్‌ పవిత్ర మాసం ప్రారంభంలోగానే విడుదల చేస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. పాకిస్థాన్‌ ఏప్రిల్‌లో 160 మంది భారత మత్స్యకారులను విడుదల చేసింది. అంతే మంది పాక్‌ మత్స్యకారులను భారత్‌జూన్‌లో విడుదల చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X