పాక్ జైలు నుంచి బారత్ బేస్తల విడుదల
కరాచి:
పాకిస్థాన్
జైలు
నుంచి
196
మంది
భారత
మత్స్యకారులు
విడుదలయ్యారు.
పాకిస్థాన్
సముద్ర
జలాల్లోకి
ప్రవేశించినందుకువీరిని
అరెస్టు
చేశారు.
వీరు
మంగళవారం
సాయంత్రం
32
పడవల్లో
భారత్
బయలు
దేరుతారని
పాకిస్థాన్
మత్స్యకారుల
సహకార
సంఘం
అధికార
ప్రతినిధి
ఘజన్ఫర్
అలీ
బూటా
చెప్పారు.
భారత్
కూడా
ఇదే
తీరులో
ప్రతిస్పందిస్తుందని
ఆశిస్తున్నామని,
భారత్
202
మంది
పాకిస్థాన్
మత్స్యకారులను
అదుపులోకి
తీసుకుందని
ఆయన
అన్నారు.
తమ
ప్రతినిధి
బృందం
త్వరలో
భారత్
సందర్శిస్తుందని,
202
మంది
తమ
దేశ
మత్స్యకారులను,
21
పడవలను
భారత్
త్వరలో
విడుదల
చేస్తుందని
భావిస్తున్నామని
ఆయన
అన్నారు.వీరిని
భారత్
రంజాన్
పవిత్ర
మాసం
ప్రారంభంలోగానే
విడుదల
చేస్తుందని
ఆశిస్తున్నట్లు
ఆయన
తెలిపారు.
పాకిస్థాన్
ఏప్రిల్లో
160
మంది
భారత
మత్స్యకారులను
విడుదల
చేసింది.
అంతే
మంది
పాక్
మత్స్యకారులను
భారత్జూన్లో
విడుదల
చేసింది.